ఫిరంగిపురం గ్రామంలో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన
తాడికొండ, ఆగస్టు 21:
ఫిరంగిపురం గ్రామంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమీపంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదలకు నాణ్యమైన భోజనం తక్కువ ధరకు అందించేందుకు అన్నా క్యాంటీన్లు ముఖ్య భూమిక వహిస్తాయని, ప్రతి గ్రామంలో ప్రజలకు ఉపయోగకరమైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రాంతీయ పార్టీ నాయకులు, ముఖ్య వ్యక్తులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి