పోస్ట్‌లు

NaraChandrababuNaidu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన P4 కార్యక్రమం

చిత్రం
                                           మంగళగిరి: మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో P4 కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా ముఖ్య నిర్ణయాలు చర్చించగా, స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్య సాధనకు సంబంధించి కీలక అంశాలు ప్రస్తావించబడ్డాయి.                                       ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు కూడా కార్యక్రమంలో పాల్గొని, ముఖ్యమంత్రి నాయుడు గారితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికపై విశదీకరణలు చేపట్టారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేశారు.