సుపరిపాలనలో తొలి అడుగు – ప్రజల చెంతకు అభివృద్ధి, సంక్షేమం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం “సుపరిపాలనలో తొలి అడుగు” భాగంగా, గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 8వ డివిజన్, పాత గుంటూరు గాంధీ బొమ్మ సెంటర్ నుండి కార్యాచరణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గారు పాల్గొని, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని, వాటికి తక్షణ పరిష్కారాలు చూపించేందుకు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గారు మాట్లాడుతూ... > "ప్రజల సమస్యలను అడుగడుగునా గుర్తించి, వాటికి సమర్థవంతమైన పరిష్కారాలు చూపించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. అభివృద్ధి, పారదర్శకత, ప్రజాసేవల పట్ల మా కట్టుబాటు స్పష్టంగా ఈ కార్యక్రమంలో కనిపిస్తుంది" అని అన్నారు. ...