గుంటూరు | 21వ డివిజన్లో కొత్త తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గల్లా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం విఐపి రోడ్, కృష్ణ బాబు కాలనీలో 21వ డివిజన్ నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు హాజరై, ఫిత్తు కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మాట్లాడుతూ, “పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలకు మరింత చేరువ కావడం కోసం కొత్త కార్యాలయం ఉపయోగపడుతుంది. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక కేంద్రంగా పనిచేస్తుంది” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు స్థానికులు పాల్గొన్నారు.