పోస్ట్‌లు

Rakshabandhan లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మంగళగిరి | రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలతో ఆత్మీయంగా గడిపిన మంత్రి నారా లోకేష్

చిత్రం
                                    రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు, ఉండవల్లి నివాసానికి విచ్చేసి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గారికి రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందించారు.                               ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ, “నాకు సొంతంగా అక్కలు, చెల్లెళ్లు లేరు. మంగళగిరి మహిళలు నా అక్కాచెల్లెళ్లు. మీరందించిన ఆశీస్సులు నాకు కొండంత బలాన్నిచ్చాయి. మీ ఆశీస్సులతో మంగళగిరిని రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను” అని అన్నారు. మంత్రివర్యులు మాట్లాడుతూ, 2019లో తొలిసారి పోటీ చేసినప్పుడు 5,300 ఓట్ల తేడాతో ఓటమి చవిచూసినా, ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో పనిచేసి, గత ఎన్నికల్లో రాష్ట్రంలో 3వ అతిపెద్ద మెజారిటీతో విజయం సాధించానని గుర్తుచేశారు. ఎన్నికల హామీలలో ముఖ్యమైన ప్రభుత్వ భూముల్లో నివసించే వారికి శాశ్వత ఇళ్ల పట్టాలు అందించడంలో...

గుంటూరు | రక్షాబంధన్ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ నాయకుడు పెమ్మసాని రవికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే గల్లా మాధవి

చిత్రం
                                            రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని గుంటూరులో సోదర-సోదరీమణుల బంధానికి ప్రతీకగా ఆత్మీయ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు, కేంద్ర మంత్రి మరియు గుంటూరు పార్లమెంట్ సభ్యుడు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, టీడీపీ నాయకుడు శ్రీ పెమ్మసాని రవి గార్లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, “రాఖీ పండుగ అనేది సోదర-సోదరీమణుల మధ్య ఉండే ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవానికి ప్రతీక” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.