గుంటూరు 53వ వార్డులో పేనూయేలు ప్రార్థన మందిరం పునఃప్రతిష్ఠ

గుంటూరు | 11-08-2025 గుంటూరు నగరంలోని 53వ వార్డులో పేనూయేలు ప్రార్థన మందిరం పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా గారు హాజరై, నిర్వాహకులకు మరియు విశ్వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యాన్ని, సమాజ శాంతిని కాపాడేందుకు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రోత్సహించాలనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.