పోస్ట్‌లు

ఆంధ్రప్రదేశ్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గుంటూరులో ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు పథకం ఘన ప్రారంభం – గళ్ళా మాధవి, మహ్మద్ నసీర్ పాల్గొన్నారు

చిత్రం
                                              గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని మహిళల సాధికారత కోసం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ – ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టాండ్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, మహ్మద్ నసీర్ సహచర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.                                          మహిళల రవాణా సౌకర్యం పెంచడం, ఆర్థిక భారం తగ్గించడం లక్ష్యంగా ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు.                                              

మంగళగిరిలో స్త్రీ శక్తి పథకం ఆరంభం: సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, మాధవ్ మహిళలతో ఉచిత బస్సు ప్రయాణం

చిత్రం
                                                మంగళగిరి నియోజకవర్గంలో స్త్రీ శక్తి – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా పాల్గొన్నారు. ముందుగా ఉండవల్లి సమీపంలోని బస్టాండ్‌కు చేరుకున్న వీరికి స్థానిక ప్రజలు, నాయకులు శాలువాలు కప్పి ఘనస్వాగతం పలికారు. అనంతరం మహిళలతో కలిసి ఉచిత బస్సులో విజయవాడ సిటీ టెర్మినల్ బస్టాండ్ వరకు ప్రయాణించారు. మార్గమంతా మహిళలు, కూటమి నేతలు ఉత్సాహంగా స్వాగతం పలకగా, పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు .

మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి పర్యటన — అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన

చిత్రం
                                       మంగళగిరి: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సతీమణి శ్రీమతి నారా బ్రాహ్మణి బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.                                     లక్ష్మీ శారీస్ & డ్రెస్ మెటీరియల్స్ షోరూమ్ ప్రారంభం          మంగళగిరి పట్టణం గోలివారివీధిలో దామర్ల వేణు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ శారీస్ & డ్రెస్ మెటీరియల్స్ షోరూమ్ ను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి నారా బ్రాహ్మణి లాంఛనంగా ప్రారంభించారు. పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికిన అనంతరం, మంగళవాయిద్యాల మధ్య రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ప్రారంభించిన ఆమె, చేనేత వస్త్రాలను పరిశీలించారు. డిజైన్ల వివరాలు, చేనేత రంగానికి అందుతున్న మద్దతు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ...