పోస్ట్‌లు

మంత్రి నాదెండ్ల మనోహర్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్

చిత్రం
                                         తెనాలి నియోజకవర్గంలోని ముంపు ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గురువారం మధ్యాహ్నం పర్యటించారు. కొల్లిపర మండలంలోని కరకట్ట సమీప లంక గ్రామాలకు చేరుకున్న మంత్రి, వరద ముంపు పరిస్థితులను సమీక్షించారు. స్థానిక అధికారులు, సచివాలయ సిబ్బందితో సమావేశమై, ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.                                           అనంతరం అత్తోట, ఐతానగర్ సమీప గోలిడొంక ప్రాంతాల్లో నీట మునిగిన వరి పంట పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పంట నష్టంపై ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.                                   ...

కంచర్లపాలెంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన

చిత్రం
                                         తెనాలి, ఆగస్టు 12: తెనాలి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కంచర్లపాలెం నుంచి తేలప్రోలు మీదుగా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి కలిపే 1.3 కిలోమీటర్ల పొడవు రహదారిని రూ. 1.55 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.