గుంటూరులో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమం

గుంటూరు, ఆగస్టు 16: సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా గుంటూరు నగరంలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఆయన విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “ప్రజల కోసం, కార్మికుల సంక్షేమం కోసం, వలసవాద వ్యతిరేకంగా పోరాడిన మహానేత సర్దార్ గౌతు లచ్చన్న గారు ఎల్లప్పుడూ ప్రజల మనసుల్లో నిలిచిపోతారు. ఆయన ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత” అని అన్నారు.