గుంటూరులో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమం

గుంటూరు, ఆగస్టు 16: గుంటూరు బస్టాండ్ వద్ద సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ నసీర్ హాజరై, లచ్చన్న గారి చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ – “ప్రజల పక్షాన జీవించిన మహానేత శ్రీ లచ్చన్న గారు పేదల హక్కుల కోసం, కార్మికుల సంక్షేమం కోసం, వలసవాద వ్యతిరేక ఉద్యమంలో అజరామరమైన పోరాటం చేశారు. ఆయన చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవడం నాకు గర్వంగా ఉంది” అన్నారు. అలాగే ఆయన “లచ్చన్న గారి ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన వేసిన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.