గుంటూరు | రక్షాబంధన్ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ నాయకుడు పెమ్మసాని రవికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే గల్లా మాధవి

రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని గుంటూరులో సోదర-సోదరీమణుల బంధానికి ప్రతీకగా ఆత్మీయ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు, కేంద్ర మంత్రి మరియు గుంటూరు పార్లమెంట్ సభ్యుడు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, టీడీపీ నాయకుడు శ్రీ పెమ్మసాని రవి గార్లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, “రాఖీ పండుగ అనేది సోదర-సోదరీమణుల మధ్య ఉండే ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవానికి ప్రతీక” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.