తెనాలి లో అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల సన్మానం – కూటమి ప్రభుత్వం చేనేతకు అండగా

తెనాలి | తేదీ: 07-08-2025 అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెనాలి పట్టణ టీడీపీ కార్యాలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా స్థానిక నేతన్నలను ఘనంగా సన్మానించి, వారి సేవలను గుర్తిస్తూ పలువురు నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో: 🔹 చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు, 🔹 మార్కెటింగ్ వేదికల విస్తరణ, 🔹 నూతన మగ్గాల పంపిణీ, 🔹 హ్యాండ్లూమ్ కార్డుల నూతనీకరణ, వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించబడింది. కార్యక్రమం ముగింపులో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ అలపాటి రాజా గారు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.