79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు: 57వ వార్డులో జెండా వందనం ఘనంగా

గుంటూరు: 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 57వ వార్డులో జెండా వందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మన గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకొని, ప్రజలు దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ ఆత్మకూరు వేణుబాబు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .