ఈరోజు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి, గుంటూరు జిల్లా
ఈరోజు గురువారం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లా మంగళగిరి లో పర్యటించారు. ఉదయం 9:30 గంటలకు, మంగళగిరి వీవర్ శాల వద్ద నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో గతంలో స్థాపించబడిన వీవర్శాలను సీఎం సందర్శించారు. మగ్గాల పనితీరును పరిశీలించి, చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియను సమీక్షించారు.
అలాగే, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్, వాటి విస్తరణపై చేనేత కళాకారులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం, చేనేత కుటుంబాలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలు విన్నారు.
ఈ పర్యటన ముగింపుగా నిర్వహించిన ప్రజా వేదిక సభలో, ముఖ్యమంత్రి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో:
మంత్రి మరియు మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు
రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల, ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి