పోస్ట్‌లు

Guntur Mangalagiri లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

200 యూనిట్ల ఉచిత విద్యుత్తుపై నాయీ బ్రాహ్మణుల హర్షం

చిత్రం
                                         మంగళగిరి టౌన్: నాయీ బ్రహ్మణుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ మంగళగిరి నియోజకవర్గ నాయీ బ్రహ్మణ సేవా సంఘం మంగళవారం కృతజ్ఞత ర్యాలీ నిర్వహించింది. మంగళగిరి పట్టణంలోని నాయీ బ్రహ్మణ కమ్యూనిటీ హాలు నుంచి శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆలయం వరకు ర్యాలీ కొనసాగింది. నాయీ బ్రహ్మణులకు ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ – “వృత్తి ఆధారిత వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యంగా కల్లుగీత కార్మికులు, నాయీ బ్రహ్మణులు, చేనేత కార్మికుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. నాయీ బ్రహ్మణుల సెలూన్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, దేవాలయాల్లో పనిచేస్తున్న వారికి నెలవారీ వేతనం 25,000 రూపాయలకు పెంచడం వంటి చర్యలు వారి జీవితాల్లో వెలుగు నింపాయి” అని తెలిపారు.                 ...