తెనాలిలో క్విట్ ఇండియా అమరవీరులకు ఘన నివాళి

                         


                  

తెనాలి, ఆగస్టు 12:

క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమర వీరులకు ఘన నివాళులు అర్పించారు మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రణరంగ చౌక్ వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరుల స్థూపాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరంలో తెనాలి పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో పోలీస్ కాల్పుల్లో వీరమరణం పొందిన స్వాతంత్ర్య యోధుల త్యాగం దేశానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

                                           


కార్యక్రమంలో తెనాలి DSP జనార్ధనరావు, స్వాతంత్ర్య సమరయోధుడు షేక్ అబ్దుల్ వహాబ్ కోడలు నూర్జహాన్, హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి ఇనయతుల్లా తదితర ప్రముఖులను మంత్రి సత్కరించారు. వారికి శాలువాలు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.


కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు