గుంటూరు జిల్లా గడ్డీపాడు వద్ద చెరువు గట్టు తెగిపోవడంతో భారీ నీటి ముప్పు

                                       


గుంటూరు, ఆగస్టు 13:

గత రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా గడ్డీపాడు వద్ద గల చెరువు గట్టు తెగిపోవడంతో, పెద్ద ఎత్తున నీరు సమీప నివాస ప్రాంతాల్లోకి వెల్లువలా చేరింది. ఈ అకస్మాత్తు పరిస్థితి కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


పలు ఇళ్లు, వీధులు నీట మునిగిపోవడంతో రవాణా అంతరాయం ఏర్పడింది. గృహోపకరణాలు, ఆహార పదార్థాలు నీటిలో మునిగిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే, గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా గారు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ప్రభావిత ప్రాంత ప్రజల సమస్యలను విన్న ఆమె, తక్షణ సహాయ చర్యలు చేపట్టేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


స్థానిక అధికారులు చెరువు గట్టు మరమ్మత్తు పనులు వేగవంతం చేయాలని, అలాగే నీరు తగ్గించే చర్యలు వెంటనే ప్రారంభించాలని సూచించారు.


ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైనంత వరకు సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని అధికారుల విజ్ఞప్తి.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు