తెనాలిలో ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం – మంత్రి నాదెండ్ల మనోహర్

                                          


తెనాలి, ఆగస్టు 15: రాష్ట్ర మంత్రివర్యులు మరియు తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఈ రోజు తెనాలిలో “స్త్రీ శక్తి – ఉచిత బస్సు ప్రయాణ పథకం”ను అధికారికంగా ప్రారంభించారు. పథకం ప్రారంభోత్సవం అనంతరం, మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నుంచి విజయవాడకు ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ, మహిళలకు అందుతున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.


ఈ సందర్భంగా ప్రయాణికులు, ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించినందుకు ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మహిళల రవాణా సౌకర్యాల అభివృద్ధికి ఈ పథకం మరింత తోడ్పడుతుందని భావిస్తున్నారు..

                                         


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు