గుంటూరులో జాగర్లమూడి చంద్రమౌళి లా కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
గుంటూరులోని జాగర్లమూడి చంద్రమౌళి కాలేజీ ఆఫ్ లాలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కాలేజీ కరస్పాండెంట్, మాజీ ఎమ్మెల్సీ డా. రాయపాటి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సుధాకర్ మరియు నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ బోర్డు సభ్యుల సమక్షంలో, గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ న్యాయవాది పట్టా అందుకున్నారు.
అరుదైన సంఘటన:
మాజీ గుంటూరు జిల్లా తెలుగు విద్యార్థి మరియు తెలుగుయువత విభాగాల అధ్యక్షునిగా పనిచేసిన వ్యక్తి చేతుల మీదుగా, మాజీ గుంటూరు జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షుడు మరియు ప్రస్తుత గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షునికి లా పట్టా ప్రదానం జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అరుదైన ఘట్టంపై సహచర విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్లు న్యాయ విద్య యొక్క ప్రాముఖ్యత, సమాజంలో న్యాయవాదుల పాత్ర, మరియు విద్యార్థులు న్యాయం కోసం కృషి చేయాల్సిన అవసరంపై దృష్టి సారించారు. వేడుకలో కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి