గుంటూరు నగరంలో 55వ వార్డు అధ్యక్షుడు షంషీర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
గుంటూరు టౌన్, 06 ఆగస్టు 2025:
ఈరోజు 55వ వార్డు అధ్యక్షుడు షంషీర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా షేక్ నూరి ఫాతిమా గారు మాట్లాడుతూ, "పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్న వార్డు అధ్యక్షుడు షంషీర్ గారికి ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం. పార్టీని మరింత బలపరిచేందుకు ఇలాంటి నాయకుల పాత్ర ఎంతో ముఖ్యమైనది," అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల నాయకులు, వార్డు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అందరూ కలిసి పుట్టినరోజు వేడుకను సంతోషంగా జరిపారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి